ఉద్యోగులు, జర్నలిస్టులు, రైతులకు శుభవార్త!: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీ కేబినెట్ సోమవారం భేటీ అయింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందించే అంశం, జర్నలిస్టులకు ఇల్లు, ఉద్యోగులకు గృహ వసతి, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం తదితర అంశాలపై చర్చించారు.

- ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ పెంపునకు కేబినెట్ ఓకే. 1.572 శాతం డీఏ విడుదలకు ఆమోదం పొందిందని తెలుస్తోంది.
- డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్కరికి రూ.10వేలు పథకానికి ఆమోదం పొందిందని తెలుస్తోంది.
- 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.9400 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయించారు.
- రైతులకు కొత్త పథకం అందుబాటులోకి తెచ్చే యోచనలో సర్కార్. తెలంగాణలో రైతు బంధు పథకం లాంటి దానిని తేవాలని యోచిస్తున్నారు. దానికి రైతు రక్ష అనే పేరు పెట్టే అవకాశాలు ఉన్నాయి.
- పింఛన్ల పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.
- అగ్రిగోల్డ్ పైన కీలక నిర్ణయం.
- చుక్కల భూముల సమస్యలపై మంత్రివర్గంలో చర్చ
- ఆటో, ట్రాక్టర్లకు ట్యాక్స్ మినహాయింపుపై చర్చిస్తుంది.
- సంక్షేమ పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.
- జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 30 ఎకరాల భూమి కేటాయింపుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలుస్తోంది. రాజధానిలో నివాసం ఉండే ఉద్యోగులు, అధికారులు, జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంపై కేబినెట్లో చర్చ జరిగింది.
- 2014 నుంచి అనుమతి లేకుండా నిర్మించిన 1.66 లక్షల పేదల ఇళ్లకు రూ. 756 కోట్లు చెల్లించాలని నిర్ణయం.
- డ్వాక్రా మహిళలకు సెల్ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం.












Click it and Unblock the Notifications