అభ్యంతరకర వ్యాఖ్యలు: రామ్ గోపాల్ వర్మ పైన కేసు
హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన బుధవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో కేసు నమోదయింది. వినాయకుడి పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాదులోని ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఆయన పైన నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదయింది.
వినాయకుడి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హైదరాబాదులో ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ పైన పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదయింది.
ఆయనపై కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్తో పాటు పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదయింది. వర్మ వినాయకుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కరుణసాగర్ అనే లాయర్ సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వర్మపై 153ఏ, 505, 298, 504 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
కాగా, కాగా, రామ్ గోపాల్ వర్మ పైన పలుచోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర నవనిర్మాణసేనకు చెందిన సుమిత్ కంభేకర్, సామాజిక కార్యకర్త షాజాద్ పానావాలా తదితరులు వేర్వేరుగా కేసులు పెట్టారు. రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ (హైదరాబాద్ నగర ఉత్సవ కమిటీ) నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైదరాబాద్, గోవా, విజయవాడ, ఔరంగాబాద్ తదితర పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి.