ఏపీ కరోనా అప్డేట్-5 వేలకు తగ్గిన కొత్త కేసులు-50 వేల లోపే యాక్టివ్ కేసులు
ఏపీలో కరోనా ప్రభావం క్రమంగా అదుపులోకి వస్తోంది. నెల రోజుల క్రితం 10 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసుల సంఖ్య ఇప్పుడు కేవలం 5 వేలకు చేరువలోనే ఉంటోంది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే రోజువారీ కొత్త కేసుల సంఖ్య సగానికి తగ్గిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 50 వేల కంటే తక్కువగానే ఉండటం మరో ఊరట.
ఏపీలో గత 24 గంటల్లో 5120 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాలో 807 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఆ తర్వాత స్ధానంలో పశ్చిమగోదావరి 575, కృష్ణా 464, గుంటూరు 433 ఉన్నాయి. అత్యల్ప కేసులు నమోదైన జిల్లాల్లో కర్నూలు 144 కేసులతో టాప్లో ఉండగా.. శ్రీకాకుళం, విజయనగరం చెరో 172 కేసులతో తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లా కూడా కేవలం 190 కేసులతో మెరుగైన స్ధితిలో నిలిచింది. వీటితో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7.34 లక్షలకు చేరింది. ఇందులో 6.78 లక్షల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

మృతుల సంఖ్యలో తూర్పుగోదావరి 5, అనంతపురం 4, చిత్తూరు 4, కృష్ణాలో 4, విశాఖలో 4, గుంటూరులో 3, నెల్లూరులో 3, కడపలో 2, పశ్చిమగోదావరిలో 2, ప్రకాశం జిల్లాలో ఒకరు ఉన్నారు. గత 24 గంటల్లో 32 మంది చనిపోయారు. వీటితో కలుపుకుని ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 6086కు చేరింది. ఈ లెక్కన చూస్తే మరణాల సంఖ్య కూడా గణనీయంగా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్దితి కొనసాగితే మరణాల సంఖ్య పూర్తిగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీలో యువతకు శుభవార్త.. ఆ ఫెలోషిప్ తో నెలకు 19వేలు సంపాదించండి.. హర్రీఅప్! -
ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం.. నష్టాల్లో ఆ రైతులు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications