Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 51,603 ఎకరాల భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే పక్షం రోజుల్లోగా.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నవాటిని పట్టా భూములుగా మార్చి ఆ సంస్థ పేరిట మ్యుటేషన్‌ చేయాలని స్పష్టంచేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన అనంతరం ఏపీఐఐసీ చేతిలో ప్రభుత్వ భూములు, డీకెటీ భూములును నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

నిషేధ జాబితాలో ఉన్న పారిశ్రామిక భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి అభ్యంతరాలు లేని 70 వేల ఎకరాల ఏపీఐఐసీ భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి అనుమతించింది. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 1.56 లక్షల ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించగా.. వాటిలో 1,21,603 ఎకరాలు ఇప్పటికీ నిషేధ జాబితాలో ఉండడం గమనార్హం. ఇందులో 70 వేల ఎకరాల ప్రభుత్వ, డీకేటీ (అసైన్డ్‌) భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట భూ సేకరణ చట్టం కింద 51,603 ఎకరాల పట్టా భూములను సేకరించి ఇచ్చారు. అనేక ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములకు కూడా పరిహారం ప్రకటించి సేకరించారు. వీటిని ఏపీఐఐసీ అనేక పరిశ్రమలకు మార్కెట్‌ ధరకు కేటాయించింది. అంటే ఆయా పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఏపీఐఐసీకి చెల్లించి భూములు తీసుకున్నాయి. అయినా ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగానే నమోదయి ఉన్నాయి. వాటి వర్గీకరణ, స్వభావం మార్చలేదు.

జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!!
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!!
ap-govt-has-removed-51-603-acres-of-apiic-land-from-the-prohibited-list-under-section-22-a

ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో విధి విధానాలు

దీంతో, ఆయా పరిశ్రమలు ఆ భూములను తనఖాపెట్టి రుణాలు తీసుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని పరిశ్రమలు, కంపెనీలు, ఏపీఐఐసీ ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతు న్నాయి. ఇప్పటికే పారిశ్రామిక రాయితీలను నేరుగా కంపెనీలకే చెల్లించేందుకు ఎస్ర్కో ఖాతా తెరచిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అనూహ్యంగా, వాటికిచ్చిన భూముల స్వభావం, క్లాసిఫికేషన్‌ మార్చడంతో పాటు నిషేధం నుంచి విముక్తి కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత 51,603 ఎకరాలను 22ఏ నుంచి తొలగించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఉత్తర్వులు (జీవో 61) జారీ చేశారు. తర్వాత వాటిని ఏపీఐఐసీ పేరిట పట్టా భూమిగా మ్యుటేషన్‌ చేయాలని.. ఇదంతా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. దీంతోపాటు భూముల మ్యుటేషన్‌, భూ కేటాయింపు ప్రతిపాదనలు, ఇంకా నిషేధ జాబితా నుంచి విముక్తి కల్పించడానికి అనుసరించాల్సిన విధివిధానాలనూ ఉత్వర్వుల్లో స్పష్టం చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+