వాలంటీర్ల కొనసాగింపు పై ప్రభుత్వం తాజా సంకేతాలు..!!
ఏపీలో వాలంటీర్ల సేవలు కొనసాగేనా. ప్రభుత్వం ఆలోచన ఏంటి. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి అయిదు నెలలు పూర్తయింది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ 10 వేలు వేతనం ఇస్తామని.. వారి సేవలు కొనసాగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. కానీ, ఈ అయిదు నెలల కాలంలో వారి సేవలు వినియోగించుకోలేదు. వేతనం ఇవ్వలేదు. తాజా బడ్జెట్ లో ప్రభుత్వం ఎక్కడా వాలంటీర్ల ప్రస్తావన చేసినా.. ప్రతిపాదించిన లెక్కల పైనే చర్చ మొదలైంది.
వాలంటీర్ల భవిష్యత్
ఏపీలో అయిదు నెలలుగా వాలంటీర్ల సేవల పైన ప్రభుత్వం సస్పెన్స్ కొనసాగిస్తోంది. వాలంటీర్ల కు స్కిల్ శిక్షణ ఇచ్చి అవసరం మేర వినియోగించుకుంటామని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతూ వచ్చారు. కానీ, గత ప్రభుత్వంలో ప్రతీ నెలా వాలంటీర్ల ద్వారా అందించే పెన్షన్లను తాజా ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తోంది. తాజాగా కుటుంబ సర్వే విషయంలో నూ సచివాలయ సిబ్బందితోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వారికి అవకాశం ఇవ్వకపోయినా.. కొనసాగుతున్న వారిని కంటిన్యూ చేస్తారని భావించారు. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఏం చేయబోతున్నారు
దీంతో, వాలంటీర్లు కొద్ది రోజులుగా నిరసనకు దిగుతున్నారు. తమకు తిరిగి విధుల్లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడలో వరదలు వచ్చిన సమయంలో కొందరి వాలంటీర్ల సేవలను వినియోగించుకున్నారు. ఆ తరువాత వారికి విధులు కేటాయించలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో వాలంటీర్ల విద్యార్హతలు, వారి సేవల పైన చర్చ కు వచ్చినా నిర్ణయం మాత్రం జరగలేదు. ఇక.. ప్రభుత్వం తాజాగా వచ్చే నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ప్రవేశ పెట్టింది. అందులో గ్రామ వాలంటీర్ల కోసం రూ 194.69 కోట్లు, వార్డు వాలంటీర్ల కోసం రూ 82.51 కోట్లు కేటాయించింది. అయితే, ఈ నిధులు గతంలో ఓట్ ఆన్ ఎకౌంట్ లో ప్రతిపాదించి ఏప్రిల్, మే నెలలో చెల్లించినవిగా చెబుతున్నారు.
బడ్జెట్ లో నిధులేవి
వాలంటీర్లకు ఇప్పటికే అయిదు నెలల వేతనాలు ఇవ్వాల్సి ఉంది. అదే విధంగా వచ్చే అయిదు నెలలకు కేటాయింపులు లేవు. విధులు కేటాయించక పోవటంతో వేతనాలు గడిచిన అయిదు నెలల బకాయిలు ఇవ్వటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే విధంగా.. వచ్చే అయిదు నెలల కాలానికి నిధులు ప్రతిపాదించకపోవటంతో.. వచ్చే మార్చి వరకు వాలంటీర్లకు తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. సచివాలయాలను సైతం గ్రామ పంచాయితీ పరిధిలోకి తీసుకొచ్చి.. సిబ్బంది సర్దుబాటు పైన కసరత్తు జరుగుతోంది. ఇవన్నీ పూర్తయిన తరువాతనే ఏ సంఖ్య మేరకు వాలంటీర్లు అవసరం.. ఏ సేవలకు వినియోగించుకోవాలి అనే అంశం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications