పునర్వ్యవస్థీకరణ లో బిగ్ ట్విస్ట్ - అభ్యంతరాలతో కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు చేసింది. రెవిన్యూ డివిజన్ లో మండలాల విలీనం పైనా నిర్ణయం తీసుకుంది. వీటి పైన గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. కాగా.. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నేతలతో పాటుగా ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలు.. నిరసనల పైన ప్రభుత్వం నివేదిక కోరింది. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయంలో కొన్ని మార్పుల దిశగా రెవిన్యూ శాఖ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న ప్రాథమిక గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అలాగే ఆరు కొత్తగా రెవెన్యూ డివిజన్లు, ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ పునర్వ్యవస్థీకరణపై నెల రోజుల్లో ప్రజలు తమ సూచనలు, సలహాలు, అభ్యంతరాలు సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాల కలెక్టర్లకు 500కుపైగా విన్నపాలు, అభ్యంతరాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఎక్కువ శాతం నెల్లూరు జిల్లా నుంచే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను పునర్వ్యవస్థీకరణలో తిరుపతి జిల్లాలోని గూడూరు డివిజన్లో విలీనం చేశారు. ఈ నిర్ణయాన్ని మూడు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తమ మండలాలను తిరిగి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ గత కొద్దిరోజులుగా అధికార టీడీపీ నేతలు, కార్యకర్తలే పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశంపై వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రభుత్వానికి వరసగా లేఖలు రాశారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ను, మంత్రివర్గ ఉపసంఘం సభ్యులను, రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయుప్రసాద్ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఇంతలా నిరసన వ్యక్తం చేస్తుంటే.. ఆ మండలాలను ఏ ప్రాతిపదికన తిరుపతిలో కలిపారన్న చర్చ మొదలైంది. దీంతో.. స్వయంగా సీఎం చంద్రబాబు నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. వారి ఆందోళనకు కారణాలు, స్థానిక అంశాలు, ఇంకా రాజకీయ పరిస్థితులపై వేర్వేరు నివేదికలు తెప్పించుకున్నారు. ప్రజా స్పందనను పరిగణలోకి తీసుకుని, ఆ తిరుపతిజిల్లాలో విలీనం చేసిన ఆ మూడు మండలా ల ను తిరిగి నెల్లూరులోనే కొనసాగించాలని ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో, ఈ నెల 28న జరిగే సమావేశంలో ఈ విషయంపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. ఇంకోవైపు.. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి కొత్తగా 17 గ్రామాలతో పెద్దహరివాణం మండలాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా స్థానికంగా పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద హరివాణం మండలం వద్దని, ఆదోనిలోనే కొనసాగించాల ని పలు గ్రామాల ప్రజలు, సంఘాల ప్రతినిధులు రిలే నిరాహారదీక్షలు కూడా చేపట్టారు. తమ గ్రామాలను ఆదోనిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల నుంచి వచ్చిన విన్నపాలపై రెవెన్యూ శాఖ కలెక్టర్ల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ నెల 28న కీలక సమావేశం నిర్వహించనుంది. ఆ భేటీలో చర్చించి ముఖ్యమంత్రికి నివేదిక ఇవ్వనుంది. ఆ తరువాత తుది నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications