సంచలనం:ఛీటింగ్ కేసులో టీడీపీ నాయకుడికి జైలు శిక్ష, జరిమానా
చిత్తూరు జిల్లా:బ్యాంకులను మోసగించిన కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక టిడిపి నేతను కోర్టు దోషిగా తేల్చడం సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లాకు చెందిన టిడిపి నేత జి.జయశంకర్ నాయుడును ఈ బ్యాంకుల ఛీటింగ్ కేసులో కోర్టు ముద్దాయిగా నిర్థారించింది.
ముందుగా ఒక బ్యాంకులో డాక్యుమెంట్ ను పూచికత్తుగా ఉంచి ఆ తరువాత అదే డాక్యుమెంట్ తో మరో బ్యాంకులో రుణం పొంది ఇలా రెండు బ్యాంకులను మోసగించిన కేసులో జి.జయశంకర్ నాయుడును కోర్టు దోషిగా తేల్చింది. దీంతో జి.జయశంకర్ నాయుడుకు పుత్తూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామానికి చెందిన జి.జయశంకర్ నాయుడు(48)...ఆరేళ్ల క్రితం 2012లో తన పొలానికి సంబంధించిన టైటిల్ డీడ్ను సప్తగిరి గ్రామీణ బ్యాంకు(ఎస్జీబీ)లో పూచీకత్తుగా ఉంచి రూ.2 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఆయన ఆ తర్వాత ఆ బ్యాంకు సిబ్బంది సహకారంతో తాను పూచికత్తు గా ఉంచిన టైటిల్ డీడ్ను సప్తగిరి గ్రామీణ బ్యాంకు నుంచి అక్రమంగా వెనక్కు తీసేసుకున్నారు.
ఆ తరువాత ఆ డాక్యుమెంట్ ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో పూచికత్తుగా ఉంచి మళ్ళీ రూ.2 లక్షల రుణం పొందారు. అయితే రెండేళ్ల తర్వాత సప్తగిరి గ్రామీణ బ్యాంకు శాఖలో ఆడిటింగ్ జరిగిన సందర్భంలో ఆ డాక్యుమెంట్ మాయమైన సంగతి వెలుగు చూసింది. దీంతో అధికారులు ఆరా తీస్తే బ్యాంకు సిబ్బంది సహకారంతోనే డాక్యుమెంట్ మాయమైనట్లు తెలిసింది.
దీంతో అప్పటి సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏజీఎం చేసిన ఫిర్యాదుతో జయశంకర్ నాయుడు, బ్యాంకు సిబ్బంది దుర్గ, కె.శ్రీనివాస్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పుత్తూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. విచారణలో జయశంకర్ నాయుడు నేరం రుజువు కావడంతో ఆయనకు ఆరునెలల జైలు శిక్షతో పాటు రూ.2500 జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్జడ్జి పి.లీలా వెంకట శేషాద్రి బుధవారం తీర్పు చెప్పారు.
జయశంకర్ నాయుడు జరిమానా చెల్లించని పక్షంలో మరో మూడువారాల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. మిగిలిన నిందితులైన దుర్గ, శ్రీనివాస్పై నేరం రుజువు కాకపోవడంతో నిర్దోషులుగా పేర్కొన్నారు. ఏపీపీ ప్రేమ్సాగర్ ప్రాసిక్యూషన్ తరపున వాదించారు. జైలు శిక్షకు గురైన జయశంకర్నాయుడు గతంలో చిన తయ్యూరు ఎంపీటీసీగానూ, మండల టీడీపీ అధ్యక్షుడిగానూ పనిచేశారు. ప్రస్తుతం ఆయన చిత్తూరు జిల్లా టీడీపీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications