చంద్ర గ్రహణం రోజు నరబలి: తప్పించుకున్న యువకుడి ఫిర్యాదు, ఏడుగురు అరెస్ట్
కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం యలమందలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చంద్రగ్రహణం రోజు కావడంతో శుక్రవారం నరబలి ఇచ్చేందుకు ఏడుగురు వ్యక్తులు ప్రయత్నించారు. యలమంద సమీపంలోని పొలాల్లో ఏడు ఐదడుగుల గుంతలు తవ్వారు.
Recommended Video

రాంప్రసాద్ అనే వ్యక్తితోపాటు ఏడుగురు దుండగులు చిన్నం ప్రవీణ్ అనే యువకుడిని అక్కడి తీసుకెళ్లారు. ఆ భారీ గుంతలను గమనించిన ప్రవీణ్.. ఏదో జరుగుతోందని గమనించి వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రాంప్రసాద్ తోపాటు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ చెట్టు వద్ద పూజలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి వారిని పోలీసులు విచారిస్తున్నారు. చంద్ర గ్రహణం రోజున నరబలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయనే ఈ ఘోరానికి సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications