చంద్ర గ్రహణం రోజు నరబలి: తప్పించుకున్న యువకుడి ఫిర్యాదు, ఏడుగురు అరెస్ట్
కృష్ణా: జిల్లాలోని నూజివీడు మండలం యలమందలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. చంద్రగ్రహణం రోజు కావడంతో శుక్రవారం నరబలి ఇచ్చేందుకు ఏడుగురు వ్యక్తులు ప్రయత్నించారు. యలమంద సమీపంలోని పొలాల్లో ఏడు ఐదడుగుల గుంతలు తవ్వారు.
Recommended Video

రాంప్రసాద్ అనే వ్యక్తితోపాటు ఏడుగురు దుండగులు చిన్నం ప్రవీణ్ అనే యువకుడిని అక్కడి తీసుకెళ్లారు. ఆ భారీ గుంతలను గమనించిన ప్రవీణ్.. ఏదో జరుగుతోందని గమనించి వారి బారి నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వెంటనే స్పందించిన పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని రాంప్రసాద్ తోపాటు ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో ఓ చెట్టు వద్ద పూజలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి వారిని పోలీసులు విచారిస్తున్నారు. చంద్ర గ్రహణం రోజున నరబలి ఇస్తే గుప్త నిధులు దొరుకుతాయనే ఈ ఘోరానికి సిద్ధమయ్యారని పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications