నాటు కోడి కిలో రూ.500, మటన్ రూ.900: YS Avinash Reddy
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ... వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు రాజకీయంగానే కాదు, సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారం రేపుతోంది. కీలకమైన జాతీయ వేదికపై రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను లేవనెత్తాల్సిన సమయంలో... "నాటుకోడి ధరలపై ప్రశ్న ఏంటి?" అంటూ ప్రతిపక్షాల నుంచే కాదు, నెటిజన్ల నుంచీ కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కడప నుంచి వైసీపీ తరఫున ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, లోక్సభలో ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి మాంసం ధరల అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో మటన్ కంటే నాటుకోడి మాంసం ధర ఎక్కువగా ఉందని పేర్కొంటూ... ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తెలుసా? అంటూ ప్రశ్నించారు. అంతేకాదు, పౌల్ట్రీ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రోగ నియంత్రణ, బయో సెక్యూరిటీ, బీమా వంటి చర్యలు తీసుకుంటుందా? ఒకవేళ తీసుకోకపోతే కారణాలేంటని నిలదీశారు.

ఈ ప్రశ్నకు కేంద్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానం ఇచ్చారు. ఆయన సమాధానమే ఇప్పుడు మరో వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్లో నాటుకోడి మాంసం ధర కిలో రూ.500గా ఉందని, అదే సమయంలో మటన్ ధర కిలో రూ.900 వరకు ఉందని సభకు తెలిపారు. అంటే... నాటుకోడి మటన్ కంటే ఖరీదైనదన్న ఎంపీ వాదనకు కేంద్ర గణాంకాలు సరిపోలలేదన్న అభిప్రాయం వెలువడుతోంది.
కేంద్రమంత్రి స్పష్టం..
ఇంకా బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల కారణంగా పౌల్ట్రీ రంగానికి నష్టం వాటిల్లితే, పరిహారంలో భాగంగా కేంద్రం 50 శాతం నిధులు అందిస్తుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. కోళ్లకు వచ్చే వ్యాధులను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ సహాయాన్ని కూడా కేంద్రం అందిస్తోందన్నారు. ఎంపీ అడిగిన మిగతా ప్రశ్నలు ఉత్పన్నం కావని, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే సమాధానం ఇచ్చామని చెప్పారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్..
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు రాజకీయ విమర్శలకు కారణమవుతోంది. "అమరావతి, ప్రత్యేక హోదా, కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రయోజనాలపై ప్రశ్నలు అడగాల్సిన పార్లమెంట్లో... నాటుకోడి ధరలేనా?" అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు, రైతుల సమస్యల్ని ప్రస్తావించడంలో తప్పేముందని వైసీపీ వర్గాలు ఎదురుదాడి చేస్తున్నాయి.
ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాల అంశాలు, మరోవైపు ప్రజల దైనందిన సమస్యలు... పార్లమెంట్ వేదికపై ఏది ప్రాధాన్యం అన్నదే ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. నాటుకోడి ధరల ప్రశ్నతో మొదలైన ఈ అంశం... అవినాష్ రెడ్డి రాజకీయ పాత్రపై, వైసీపీ పార్లమెంటరీ వ్యూహాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications