టిడిపిపై దాడి: వైయస్ జగన్ పార్టీపై బాలయ్య ఫిర్యాదు
హైదరాబాద్: అనంతపురం జిల్లా లేపాక్షి మండలంలోని గొంగటిపల్లి సమీపంలో సోమవారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడిచేశారు. ఈ దాడిలో ఆరుగురు టిడిపి కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా వారి వాహనం ద్వంసమైంది. దీనిపై లేపాక్షి పోలీస్స్టేషన్లో బాలకృష్ణ ఫిర్యాదు చేశారు.
కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో వైయస్సార్ కాంగ్రెసు ప్రచార రథంపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేశారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలోని వలపర్ల గ్రామంలో సోమవారం తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

పర్చూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి గొట్టిపాటి భరత్ తల్లి పద్మ, అతని సోదరి లక్ష్మీలు గ్రామంలో రోడ్డు షో నిర్వహించారు. అదే సమయంలో టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు కార్యకర్తలతో రోడ్డు షో నిర్వహిస్తూ వారికి ఎదురయ్యారు. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగారు.
విశాఖపట్నం జిల్లా గాజువాక కాంగ్రెస్ అభ్యర్థి, సినీనటుడు జీవీ సుధాకర్నాయుడుపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి దాడి చేశారు. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కారు అటకాయించి, రాడ్లతో దాడి చేయగా జీవీ అపస్మారక స్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications