కొడాలి నానీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ .. జగన్ వారిని కట్టడి చెయ్యాలి .. లేదంటే అంటూ వార్నింగ్
తిరుమలలో అన్య మతస్థుల డిక్లరేషన్ విషయంపై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి డిక్లరేషన్ అవసరం లేదంటూ, స్వామిపై విశ్వాసం ఉంటే చాలంటూ టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైన రగడ నేటికీ కొనసాగుతోంది. ఇక తాజాగా కొడాలి నానీ వ్యాఖ్యలు అగ్నికి ఆర్ఘ్యం పోసినట్టు అయ్యింది . దీంతో ఏపీ బీజేపీ నేతలు ఏపీ సర్కార్ పై , కొడాలి నానీపై భగ్గుమంటున్నారు.
Recommended Video

తిరుమలలో డిక్లరేషన్ తొలగించాలని కొడాలి నానీ వ్యాఖ్యలు
తిరుమల డిక్లరేషన్ వివాదం చిలికి చిలికి గాలివానగా మారగా డిక్లరేషన్ తొలగిస్తామని తాము అనలేదని, ప్రతి ఒక్కరి నుండి డిక్లరేషన్ తీసుకోవడం సాధ్యం కాదని మాత్రమే అన్నానని టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చినా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో తాజాగా వివాదం మరింత ముదిరింది. మంత్రి కొడాలి నాని తిరుమల డిక్లరేషన్ ఎందుకు అని ప్రశ్నిస్తూ ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదులలో ఎక్కడా డిక్లరేషన్ విధానం లేదని, ఈ విధానాన్ని తిరుమలలో కూడా తొలగించాలంటూ డిమాండ్ చేశారు. హిందూ ఆలయాల్లో దాడులు జరిగితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని లెక్కలు చెప్పారు .

మండిపడుతున్న బీజేపీ .. ప్రకటన విడుదల
కొడాలి నానీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అధికార మదంతో, నిలువెల్లా అహంకారంతో హిందూ దేవుళ్లను, హిందువుల సాంప్రదాయాలను అవమానపరుస్తూ కొడాలి నాని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నేడు పార్టీ తరఫున ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ బీజేపీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తమ పార్టీ మంత్రులను, నాయకులను కట్టడి చేస్తే మంచిదంటూ హెచ్చరించారు. వెంకటేశ్వర స్వామి పై పిచ్చి వాగుడు వాగితే హిందువులు తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

సీఎం జగన్ తమ మంత్రులను , నేతలను కంట్రోల్ చెయ్యాలని డిమాండ్
పరిస్థితి అంత వరకు రాకముందే సీఎం జగన్ తమ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పార్టీ తరఫున నేతలు హెచ్చరికలు జారీ చేశారు. అంతర్వేది రథం దగ్ధం ఘటన జరిగితే, దుర్గగుడిలో సింహాలు మాయమైతే, ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేస్తే పోయేది ఏమీ లేదా ? అంటూ ప్రశ్నించారు. వాటిని డబ్బుతో వెల కడతారా నానీ అంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు.

తిరుమలపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ వార్నింగ్
అంతర్వేది చర్చిలో రెండు అద్దాలు పగిలితే 41 మందిపై కేసులు ఎందుకు పెట్టారంటూ ప్రశ్నించారు అద్దాలు పగిలిన దానికి వెయ్యి ,రెండు వేలు ఇస్తే సరిపోయేది కదా అంటూ బిజెపి నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. హిందూ దేవాలయాల పై, తిరుమలపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ వార్నింగ్ ఇచ్చారు. తిరుమలలో డిక్లరేషన్ కొనసాగవలసిందే అంటూ ఏపీ బీజేపీ డిమాండ్ చేసింది. ఏపీలో గత కొంత కాలంగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ నిప్పులు చెరుగుతుంది. దేవాలయాల పరిరక్షణ కోసం ఏపీ బీజేపీ చివరి వరకు పోరాటం సాగిస్తామని చెప్తుంది .
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications