బీజేపీ ఎంపీ అభ్యర్దిగా స్వామి పరిపూర్ణానంద- నియోజకవర్గం ఖరారు..!!
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీజేపీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. కేంద్రంలో వరుసగా మూడో సారి అధికారం దక్కించకొనే దిశగా హ్యాట్రిక్ విజయం కోసం పావులు కదుపుతోంది. అందులో భాగంగా దక్షిణాదిన ఎక్కువ సట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీ, తెలంగాణలోనూ ఈ సారి లోక్ సభ అభ్యర్దుల ఫైన వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ ఎంపికలో స్వామి పరిపూర్ణానందను పార్లమెంట్ ఎన్నికల బరిలో దింపాలని భావిస్తోంది.
పోటీకి సిద్దం : కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పరిపూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ గెలుపు కోసం కీలక బాధ్యతలు నిర్వహించారు. ఇంఛార్జ్ గా పని చేసారు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచినా ఓట్ల శాతం పెరిగింది. ఆ తరువాత పార్టీ విస్తరణ..ప్రచారం కొనసాగించారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో నిజాబామాద్, అదిలాబాద్ పరిధిలో చేసిన ప్రచారం..హిందుత్వ సభల ద్వారా అనూహ్యంగా బీజేపీకి మద్దతు పెరిగింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది.

హైకమాండ్ తో సత్సంబంధాలు : ఈ సారి ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి బీజేపీ అభ్యర్దిగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పరిపూర్ణానంద సన్నిహితంగా ఉంటారు. తెలంగాణలో కాంగ్రెస్ 12 ఎంపీ స్థానాలు గెలుస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి సిట్టింగ్ సీట్లతో పాటుగా మల్కాజ్ గిరి, చేవెళ్ల ఖచ్చితంగా గెలవాలని బీజేపీ టార్గెట్ గా ఫిక్స్ చేసింది. దీంతో, మల్కాజ్ గిరి లేదా ఏపీలోని హిందూపూర్ స్థానాల్లో స్వామి పరిపూర్ణానంద పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

రెండు సీట్లలో పరిశీలన : హిందూపురంలో హిందూ మత ప్రచారం, వ్యాప్తిలో స్వామి పరిపూర్ణానంద కొంత కాలంగా యాక్టివ్ గా ఉన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావటం..దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టుుండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీతో బీజేపీ పొత్తు ఖాయమని భావిస్తున్న స్వామి పరిపూర్ణానంద కు సీటు కేటాయింపు అంశం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ వేడుకల్లో స్వామి పరిపూర్ణానంద పాల్గొంటున్నారు. ఈ వేడుక తరువాత సీట్ల కేటాయింపు గురించి బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications