కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేశ్ రూ.30 కోట్లు..!?
ఏపీలో ఎన్నికలవేళ అనూహ్య అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మూడు పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా మారుతోంది. బీజేపీ తమ అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొనసాగిస్తుంది. ఇదే సమయంలో కమలం పార్టీ నుంచి ఎంపీ స్థానం ఆశిస్తున్న సీఎం రమేష్ కు సంబంధించి ఆసక్తికర అంశాలు ప్రచారంలోకి వచ్చాయి.
టీడీపీ జనసేన బిజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చింది. టీడీపీ మూడు జాబితాల ద్వారా 139 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది. 13 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేశారు. జనసేన, బీజేపీ తమ అభ్యర్థుల జాబితా వెల్లడించాల్సి ఉంది. బీజేపీ నుంచి ఈసారి ఆరు ఎంపి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు బరిలో నిలవనన్నారు. గతంలో టీడీపీలో కీలక నేతగా వ్యవహరించి ఆ తర్వాత బీజేపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేష్ ఈసారి అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సీఎం రమేష్ పేరు కూటమి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సమయంలోనే సీఎం రమేష్ కు సంబంధించిన కీలక అంశాలు ప్రచారంలోకి వచ్చాయి.

తాజాగా వెల్లడైన ఎలక్ట్రోల్ బాండ్స్ అంశంలో సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి రూ 30 కోట్లు విరాళం ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్ తో పాటుగా సీఎం రమేష్ జనతాదాల్ సెక్యులర్ కు రూ10 కోట్లు, తెలుగుదేశం పార్టీకి రూ 5 కోట్లు ఇచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు సీఎం రమేష్కు సంబంధించిన ఈ అంశాన్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉంటూ కాంగ్రెస్కు విరాళాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల సీఎం జగన్ ను టార్గెట్ చేయడం, టీడీపీ నేతలు షర్మిలకు మద్దతు ఇవ్వటం పైన వైసీపీ నేతలు తరచు సీరియస్ అవుతున్నారు. ఇప్పుడు కడప జిల్లాకే చెందిన సీఎం రమేష్ ఒకప్పటి టీడీపీ ముఖ్యనేతగా, ప్రస్తుత బీజేపీ ఎంపీగా కొనసాగుతూ కాంగ్రెస్ కు రూ 30 కోట్లు చెల్లించడం పైన రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనిపైన సీఎం రమేష్ ఏ రకంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications