టీడీపీపై కోపం హోదాకు అడ్డుకావొద్దు: బీజేపీకి పవన్, ముఖ్యమైన రోజు: మోడీ
హైదరాబాద్: అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో ప్రత్యేక హోదా గురించి ఓ పోస్టు పెట్టారు. తెలుగుదేశం నాయకత్వంపై బీజేపీ ఆగ్రహం.... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం కాకూడదని ఆకాంక్షించారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని అడిగే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో తాను కూడా కలుస్తున్నానని జనసేనాని మరో ట్వీట్ చేశారు. మన హక్కులను తెలపడానికి పార్లమెంటుకు మించిన వేదిక లేదని పేర్కొన్నారు.

కాగా, అంతకుముందు ప్రధాని మోడీ ట్విట్టర్లో అవిశ్వాసంపై స్పందించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు ముఖ్యమైన రోజని మోడీ అన్నారు. అవిశ్వాసం తీర్మానంపై సమగ్రమైన, నిర్మాణాత్మకమైన చర్చకు సభ్యులందరూ సహకరిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
విభజన చట్టపరంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలుతో పాటు అన్నింటిని తెలియచెప్పాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోకసభలో చర్చకు సిద్ధమైంది. ఉదయం 11 గంటలకు గల్లా జయదేవ్ ప్రసంగంతో చర్చ మొదలై సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. ఆ తర్వాత ప్రధాని మోడీ ఇచ్చే సమాధానంపై సభ్యులు వివరణ కోరవచ్చు.
-
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications