'అమరావతికి పర్యాటక శోభ.. కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్'
రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనా వాటర్ ఫ్రంట్గా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశం ఆమోదాన్ని తెలియజేసింది.
మెరీనా వాటర్ ఫ్రంట్లో భాగంగా జెట్టీలు, టూరిజం లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్ స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని సీఎం సూచించారు. వాటర్ ఫ్రంట్ రూపకల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్తో పాటు వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
బ్లూ- గ్రీన్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దే క్రమంలో అంతర్గత కాలువల నిర్మాణం, సుందరీకరణ పనులు జరగాలన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన నిర్మించే నూతన బ్యారేజ్ తో రాజధానికి నీటి వనరులు సమకూరతాయని వివరించారు. కృష్ణానదికి ఇరు వైపులా అద్భుతమైన వాటర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకోవచ్చని సూచించారు. నదిలో ఉన్న ఐ ల్యాండ్స్ ను పర్యాటకపరంగా అభివృద్ధి చేసుకునే దానిని పరిశీలించాలని చెప్పారు.
రాజధానిలో అనాథ మైనర్లకు పెన్షన్
ల్యాండ్ పూలింగ్ స్కీంలో భాగంగా రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇస్తున్న పెన్షన్లను మైనర్లయిన అనాథలకు కూడా వర్తింప చేసేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇకపై తల్లిదండ్రులను కోల్పోయిన మైనర్లకు నెలకు రూ.5,000 చొప్పన పెన్షన్ రూపంలో అందిస్తారు.
మరోవైపు ఏపీ సీఆర్డీఏలో పలు కేడర్లకు సంబంధించి మొత్తం 754 పోస్టులకు సంబంధించిన ర్యాటిఫికేషన్కు అథారిటీ ఆమోదం తెలిపింది. అలాగే, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో 112 వీధి శూల కలిగిన ప్లాట్లకు బదులుగా మరోచోట ప్లాట్ల కేటాయింపునకు అంగీకరించింది. అయితే మ్యుటేషన్ అవ్వని, థర్డ్ పార్టీకి విక్రయించని ప్లాట్ల వరకు ఈ వెసులుబాటు కల్పించారు. రైతులకు ఏ ఇబ్బందీ లేకుండా చూడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
ఖతార్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం
అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్, సీఆర్డీఏ ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ మోడల్స్ ను అధ్యయనం చేయాలని, ఆస్తులను సమకూర్చుకుని సుస్థిర ఆదాయం పొందేలా రెండు సంస్థలు ఎదగాలని సీఎం స్పష్టం చేశారు.

స్పోర్ట్స్ సిటీ వంటి ప్రాజెక్టుల కోసం ఖతార్ మోడల్ ను అధ్యయనం చేయాలన్నారు. అమరావతిలో చేపట్టిన రాజధాని నిర్మాణం పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, సీఎస్ విజయానంద్, పురపాలక- సీఆర్డీఏ- ఆర్ధిక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
-
మండలిలో 'చీకటి' రోజు.. బయటపడ్డ వైసీపీ అరాచకాలు! -
సాష్టాంగ ప్రణామం.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి దక్కిన విజయం -
కేసీఆర్ కాళ్లు పట్టుకునైనా సరే.. అలా చేస్తానంటూ వైసీపీ నేత వార్నింగ్ ! -
అమరావతి బిల్లు పై పార్లమెంట్ లో వైసీపీ బిగ్ ట్విస్ట్..!! -
అమరావతిపై జగన్ ప్లాన్ 'బీ' - కొత్త రాజధాని “మావిగన్”..!! -
అమరావతికి వైసీపీ వ్యతిరేకం కాదు, కానీ అక్కడే- జగన్ సంచలన ప్రకటన..!! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
అమరావతిపై జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్.. అంగుళం కూడా కదల్చలేవ్ -
Amaravati Bill: అమరావతి గొంతుకనవుతా..! సాయిరెడ్డి బిగ్ ట్విస్ట్..! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!!










Click it and Unblock the Notifications