అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ. 900 కోట్లు విడుదల: అమరావతి, పోలవరానికి కేంద్రం నిధులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు రూ.900 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి రూ. 500 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.200 కోట్లు విడుదల చేసింది. అమరావతి నిర్మాణానికి రూ.200 కోట్లను అందజేసింది.

వారం రోజుల్లో రూ.650 కోట్లు కేంద్ర పన్నుల వాటాలోని బకాయిల కింద విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. మరో రూ.900 కోట్లు సాయం అందజేసేందుకు సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది.

amaravati

25వేల ప్రభుత్వోద్యోగాల భర్తీకి కసరత్తు: చంద్రబాబు

త్వరలోనే 25వేల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని... దీనిపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. 6 లక్షల ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా పూర్తి చేసి చూపిస్తామన్నారు. జియో ట్యాగింగ్‌ ద్వారా పనులు పరిశీలించి ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తామన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X