నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో క్షిపణి పరీక్ష కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1600 కోట్లతో చేపట్టనున్న ఈ క్షపిణి పరీక్షకేంద్రం ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కూడా మంజూరయ్యాయి.
తొలి దశ అనుమతులను కేంద్ర అటవీ, పర్యావరణమంత్రిత్వ శాఖ మంజూరు చేసింది. రూ.1000 కోట్లతో డీఆర్డీవో క్షిపణ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు ఎప్పటి నుంచో ప్రతిపాదన ఉంది.

ఈ కేంద్రం రెండు దశల్లో ఏర్పాటు కానుంది. మొదటి దశలో రూ.600కోట్లతో పనులు ప్రారంభమవుతాయి. ఈ పనులు అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
కాగా,, రెండేళ్ల కిందటే ఈ క్షిపణి కేంద్రం రావాల్సి ఉన్నప్పటికీ కొన్ని అనుమతులు రావాల్సి ఉండటంతో ఆలస్యమైనట్టు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications