మా ప్రాంతాలకు వెళ్తామని ఎమ్మెల్యేలు, నంద్యాలకు వెళ్లాలని చంద్రబాబు
దాదాపు నెల రోజుల పాటు తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.
Recommended Video

అమరావతి: దాదాపు నెల రోజుల పాటు తమ తమ నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని పలువురు టిడిపి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అన్నారు.
దానికి ఆయన స్పందిస్తూ.. మీ నియోజకవర్గం ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారని, శుక్రవారం నంద్యాల వెళ్లాలని సూచించారు. ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు.
చంద్రబాబు నాయుడు బుధవారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో జాబితా సిద్ధం చేసి తనకు అందించాలని నాయకులను ఆదేశించారు.

ఎమ్మెల్యేల విజ్ఞప్తి ఇలా
అక్కడ ఉప ఎన్నిక కోసం పని చేసిన వారంతా శుక్రవారం నంద్యాల వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్న భరోసా ఇవ్వాలన్నారు. తాము దాదాపు నెల రోజుల నుంచి నియోజకవర్గాలకు దూరంగా ఉన్నామని, ఇప్పుడు తమ నియోజకవర్గాలకు వెళ్తామని, కొన్ని రోజుల విరామం తర్వాత నంద్యాల వెళ్తామని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చెప్పారు.

మీకోసం తిరిగితే ఇబ్బంది కానీ
దానిపై చంద్రబాబు స్పందించారు. ఇది పార్టీని పటిష్ఠం చేసేందుకు మీరు చేస్తున్న త్యాగమని, మీ నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని అర్ధం చేసుకుంటారని, ఇప్పటికే చాలామంది మిమ్మల్ని అభినందించి ఉంటారని, మీరు నియోజకవర్గాన్ని వదిలేసి సొంత పనుల కోసం తిరుగుతుంటే ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప, పార్టీ కోసం కష్టపడుతుంటే అందరూ అభినందిస్తారని చెప్పారు.

ఇంకోరోజు ఉండి బుక్ తయారు చేయాలి
నంద్యాల ఉప ఎన్నిక 2019 సార్వత్రిక ఎన్నికలకు ఓ ప్రీ ఫైనల్గా భావించారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో మరో రోజు ఉండి అయినా సరే మొత్తం సమాచారం క్రోడీకరించి పుస్తకం తయారు చేయాలని సూచించారు.

భూమా విజ్ఞప్తికి బాబు ఓకే, సూచన
సెప్టెంబరు 4, 5 తేదీల్లో వర్క్ షాప్ నిర్వహించే సమయానికి పుస్తకం సిద్ధం కావాలని చంద్రబాబు చెప్పారు. నాయకులంతా వస్తున్నారు కాబట్టి విజయోత్సవ సభ పెట్టుకుంటామని నంద్యాలలో గెలిచిన భూమా బ్రహ్మానంద రెడ్డి అన్నారు. అభ్యంతరం లేదని, కానీ పుస్తకానికి సంబంధించిన సమాచార సేకరణ, స్థానిక నాయకుల్ని అభినందించడం వంటి కార్యక్రమాలు పూర్తయిన తర్వాతే పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. వియోజత్సవ సభ పేరుతో అసలు పని పక్కన పెట్టవద్దన్నారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications