బుద్ధి చెప్పారు: రోజాకు అఖిలప్రియ గట్టి కౌంటర్, 'జగన్కు డిపాజిట్ కూడా దక్కొద్దు'
తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా తరుచూ విమర్శిస్తారు. దీనిపై మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం నంద్యాల సభలో కౌంటర్ ఇచ్చారు.
నంద్యాల: తెలుగుదేశం పార్టీలో మహిళలకు ప్రాధాన్యత లేదని, ఈ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని వైసిపి ఎమ్మెల్యే రోజా తరుచూ విమర్శిస్తారు. దీనిపై మంత్రి భూమా అఖిలప్రియ మంగళవారం నంద్యాల సభలో కౌంటర్ ఇచ్చారు.

రోజాకు అఖిలప్రియ కౌంటర్
నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారికి బుద్ధి చెప్పి ఓడించారని అఖిలప్రియ అన్నారు. కాగా, అఖిలప్రియ దుస్తులపై రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అఖిలప్రియ పరోక్షంగా పై వ్యాఖ్యలు చేశారు.

పరిటాల సునీత, శోభా, ఇప్పుడు నేను
రాజకీయాల్లో మహిళలు రాణించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం నుంచి పరిటాల సునీతను, దివంగత నేత భూమా శోభానాగి రెడ్డిని, ప్రస్తుతం తనను ఎంతగానో ప్రోత్సహించారని అఖిలప్రియ అన్నారు. మహిళల సాధికారత టిడిపితోనే సాధ్యమన్నారు.

టిడిపికి ఓట్లు వేశారు, థ్యాంక్స్
కొన్ని ప్రభుత్వాలు మహిళల అభివృద్ధికి ఎన్నో హామీలు ఇచ్చి వాటిని విస్మరిస్తాయని, అయితే టిడిపి ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి వారి ఆర్థిక స్వావలంబనకు పెద్దపీట వేస్తోందని అఖిలప్రియ అన్నారు. నంద్యాల ప్రాంతంలోని ముస్లీం మైనార్టీ మహిళలు పెద్ద ఎత్తున టిడిపికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. వారికి థ్యాంక్స్ అన్నారు.

జగన్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కొద్దు
వచ్చే ఎన్నికల్లో వైసిపికి డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే సభలో పిలుపునిచ్చారు. వైసిపికి అభివృద్ధిని అడ్డుకోవడం తప్ప మరో పని లేదన్నారు. వారికి దశాదిశా లేకుండా పోయిందని, అలాంటి ప్రతిపక్షం అవసరం లేదన్నారు.

అందుకే నంద్యాలకు వచ్చా
నంద్యాలలో ప్రారంభించిన పనులు చూసి సమీక్ష చేసి చెప్పిన మాట నిలబెట్టకోవడానికే నంద్యాలకు వచ్చానని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్టీ, ప్రభుత్వం వేరు కాదని, నంద్యాల ఎన్నికలు సవాలుగా తీసుకొని సత్తా చాటామని చంద్రబాబు అన్నారు.

బిల్డింగులు కూలిస్తే అభివృద్ధా అని జగన్ అడిగారు
ఈ నెల 7న మళ్లీ నంద్యాలకు వస్తానని చంద్రబాబు చెప్పారు. జగన్ ప్రతి పనిని అడ్డుకుంటే, తాను ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండేలా పనులు చేస్తున్నానని చెప్పారు. బిల్డింగులు కూలిస్తే అభివృద్ధా అని నంద్యాల ప్రచారంలో జగన్ ప్రశ్నించారన్నారు. కానీ తాము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications