చంద్రబాబుకు తెలియదు: బాక్సైట్ తవ్వకాల జీవోపై కెఈ సంచలనం
విజయవాడ: విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి సంచలన ప్రకటన చేశారు. బాక్సైట్ జీవో గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, సంబంధిత మంత్రికి తెలియదని ఆయన అన్నారు.
ఈ జీవో విషయంలో పొరపాటు జరిగిన మాట వాస్తవమేనని కేఈ కృష్ణమూర్తి చెప్పారు. ముఖ్యమైన జీవోల విషయంలో అధికారులు సమాచారం ఇవ్వాలని కోరారు. అభివృద్ధిలో ఉత్తరాంధ్ర, రాయలసీమపై తాము వివక్ష చూపడం లేదన్నారు.
బుధవారం జరగనున్న రాయలసీమ జేఏసీ భేటీకి తాను హాజరుకానని చెప్పారు. కరవు మండలాలలపై రీ సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీ భూమి- మీ ఇంటికి మంచి స్పందన వస్తోందన్నారు. డిసెంబరు చివరి నాటికి ఫిర్యాదులు పరిష్కరిస్తామని కేఈ వివరించారు.

ఇదిలావుంటే, బాక్సైట్ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. తాత్కాలికంగా నిలిపి మళ్లీ తవ్వకాలు జరపాలని చూస్తే గిరిజనులు చంద్రబాబు గుండెల్లో నిద్ర పోతారని ఆయన సోమవారం విశాఖపట్నంలో అన్నారు.
సేవారంగంలో ఎఫ్డీఐలను అనుమతిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ చిన్ణాభిన్నమవుతుందన్నారు. బీజేపీ వ్యతిరేకతకు బీహార్ ఫలితాలే నిదర్శనమన్నారు. ఏపీ ప్రజలపై సానుభూతి వద్దని, విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని నారాయణ డిమాండు చేశారు.
-
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!!












Click it and Unblock the Notifications