వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీని గెలిపించారు, బీజేపీకి అద్భుత విజయమిచ్చారు: విశాఖలో చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

విశాఖ: దేశ ప్రజలు అందరూ ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు పైన నమ్మకం ఉంచారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు అన్నారు. ఆయన విశాఖపట్నంలో డిజిటల్ ట్రాన్సుఫార్మేషన్ సదస్సులో పాల్గొని, ప్రసంగించారు.

విశాఖ లాంటి నగరం దేశంలో ఎక్కడా లేదని చంద్రబాబు అన్నారు. సముద్రం, ఎత్తయిన కొండలు విశాఖ ప్రత్యేకం అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ అపూర్వ విజయం సాధించిందన్నారు. కేంద్రంలో తొలిసారి పూర్తిస్థాయి మెజార్టీతో బీజేపీ చాలా ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందన్నారు.

Chandrababu

భారత్ ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాఫ్టువేర్ రంగంలో యువత ఎంతో ప్రావీణ్యం సాధించిందన్నారు. ఎన్నో మల్టీ నేషనల్ కంపెనీలలో భారతీయులు సీఈవోలుగా ఉన్నారని చెప్పారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయి అన్నారని, మైక్రోసాఫ్టులో సత్య నాదెళ్ల కీలక పోస్టులో ఉన్నారని చెప్పారు. హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశామన్నారు. ప్రపంచ దేశాల్లో హైదరాబాదుకు గుర్తింపు ఉందన్నారు.

English summary
AP CM Chandrababu Naidu participates in digital transformation programme in vishaka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X