అప్పుడే వచ్చి ఉంటే..: చిరంజీవిపై చింతా మోహన్ ఆసక్తికరం
ఏలూరు/ హైదరాబాద్: కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవిపై కాంగ్రెసు నేత, మాజీ పార్లమెంటు సభ్యుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే విజయం సాధించేవారని ఆయన అన్నారు.
అదే సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఆయన తీవ్రమైన విమర్శలు చశారు. పోలవరం ప్రాజెక్టు అవినీతి వరంగా మారిపోయిందని ఆయన అన్నారు.

చిరంజీవి అప్పుడే వచ్చి ఉంటే...
రాజకీయాల్లోకి రావాలని చిరంజీవిని తాను అప్పుడే కోరానని, 1993లోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ఉంటే విజయం సాధించేవారని చింతా మోహన్ అన్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి, ఆ తర్వాత కాంగ్రెసులో దాన్ని విలీనం చేసిన విషయం తెలిసిందే.

మోడీకి మరక అంటింది...
సొమ్మొకడిదీ సోకొకడిది అనే మాదిరిగా పోలవరం ప్రాజెక్టును మార్చేశారని చింతా మోహన్ అన్నారు. అవినీతి మచ్చ లేదంటున్న ప్రధాని నరేంద్ర మోడీకి పోలవరంలో అవినీతి మరకగా మారిందని ఆయన అన్నారు. పోలవరంలో 50శాతం పైగా అవినీతి ఉందని విమర్శించారు. నితిన్ గడ్కరీకి పేరులో మాత్రమే నీతి ఉందని, ఆయన చేసేది అంతా అవినీతేనని చింతా మోహన్ అన్నారు.

ప్రధాని మౌనం ఎందుకు...
పోలవరం పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లు దోచుకుంటున్నారని, దీనిపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని చింతా మోహన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Recommended Video


వారు ఏకం కావాలని.
కాపులు, దళితులు ఏకమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలని చింతా మోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నుంచి గోదావరి జిల్లాల వారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
-
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
CSK vs RCB: ఓటమికి కారణమెవరంటే ? నిజాయితీగా చెప్పేసిన రుతురాజ్..! -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు! -
పొంచి ఉన్న తుఫాన్ ముప్పు, భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
నరసాపురం To అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరే వేళ ఊహించని ట్విస్ట్..!! -
షాకిచ్చిన నటాషా.. హార్దిక్ లైఫ్లో ఊహించని ట్విస్ట్! -
గంటన్నారలో అమరావతి టు హైదరాబాద్, కేంద్రం కీలక నిర్ణయం..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు..












Click it and Unblock the Notifications