మరో వివాదంలో చింతమనేని: అర్ధరాత్రి అభయారణ్యంలో రోడ్డేశారు, అటవీశాఖ సిబ్బందిపై దాడి
కృష్ణా: దెందులూరు ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలు వ్యతిరేకించి కొల్లేరు అభయారణ్యంలో రాత్రి రాత్రి రహదారి నిర్మాణం చేశారు.
శుక్రవారం అర్ధరాత్రి కృష్ణా జిల్లా ఆటపాక పక్షుల అభయారణ్యంలో తన నియోజకవర్గంలోని గ్రామమైన కోమటిలంకకు సుమారు కిలోమీటరు పొడవున రహదారి నిర్మాణం చేపట్టారు. అడ్డువచ్చిన అటవీ శాఖ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు.

అంతేగాక, ఎమ్మెల్యే అనుచరులు అటవీశాఖ సిబ్బంది దాడి చేశారు. అవసరమైతే కేసులు నమోదు చేసుకోమంటూ బెదిరించారు. దీనిపై డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కే.ఈశ్వరరావు కైకలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు చింతమనేనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గతంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ మహిళా ఎమ్మెల్యేపైనా చింతమనేని ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించారు. ఆయన అనుచరులు మహిళ అని కూడా చూడకుండా ఆమెపై దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆమె ఫిర్యాదు మేరకు చింతమనేనిపై కేసు నమోదైంది. కాగా, ఇప్పుడు అభయారణ్యంలో రోడ్డు నిర్మాణం చేసి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు చింతమనేని.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications