వాస్తు ప్రకారం చిరు ఇంటికి మార్పు, చరణ్ ట్రిప్ అందుకే!
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిరంజీవి జూబ్లీహిల్స్లోని తన ఇంటికి మరమ్మతులు చేయించనున్నారని తెలుస్తోంది. సమాచారం మేరకు.. వాస్తు నిపుణుల సూచన మేరకు చిరంజీవి తన ఇంటికి మరమ్మతులు చేయించనున్నారని తెలుస్తోంది.
చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, భార్య ఉపాసనలు ప్రస్తుతం యూకేలో ఉన్నారు. అక్టోబర్ 14వ తేదీన వారు తిరిగి హైదరాబాదుకు రానున్నారు. ఇంటికి పెద్ద మరమ్మతులు చేయనున్నందునే వారు ఈ ట్రిప్ ప్లాన్ చేశారని అంటున్నారు. అలాగే, గోవిందుడు అందరివాడే చిత్రం అనంతరం రామ్ చరణ్ తేజ కూడా బ్రేక్ తీసుకోవాలనుకున్నారని చెబుతున్నారు.

కాగా, మన దేశాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో భాగంగం కావాల్సిందిగా నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
ఇప్పటికే ప్రముఖ సినీ స్టార్స్ కమల్ హాసన్, అమీర్ ఖాన్, సూర్య వంటి వారు ఈ స్వచ్ఛ్ భారత్ మిషన్కు తమ మద్దతు ప్రకటించగా... ఇపుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తన మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు. శుభ్రతగా ఉండటం దైవభక్తితో సమానంమని, మనం శుభ్రత పాటించకపోతే భగవంతుని ఆశీసులు లభించవని గాంధీజీ అన్నారని, గాంధీజీ స్ఫూర్తితో ప్రధాని స్వచ్చ భారత్ కి పిలుపునిచ్చారంటూ ఆ వీడియో చిరంజీవి తెలియజేశారు.
-
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications