తిరుపతి: వెంకటరమణ, భూమన డిష్యూం డిష్యూం
తిరుపతి: తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వెంకటరమణ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం గురుకృపా విద్యామందిర్ పోలింగ్ బూత్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కరుణకరరెడ్డి ఓటమి భయంతో అరాచకాలు సృష్టించడానికి కడప నుంచి రెండువేల మంది గుండాలను తెప్పించారని, బుధవారం సాయంత్రం 5-45 గంటలకు భూమనతోపాటు ఆయన గుండాలు గురుకృపా విద్యామందిర్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించారని, దీనిని అడ్డుకునేందుకు లోపలకు వెళ్లిన వెంకటరమణ అడ్డుకునే ప్రయత్నం చేయగా భూమన దాడి చేశారని, దీంతో వెంకటరమణ కింద పడిపోయారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

పోలింగ్ అధికారి సమాచారం మేరకు అక్కడకు వచ్చిన పోలీసులు భూమన, వెంకటరమణ ఇద్దరినీ అర్బన్ ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దీనిని తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వ్యతిరేకించారు. భూమనపై కేసు పెట్టకుండా ఇద్దరినీ ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లడమేమిటని వారు ప్రశ్నించారు.
పోలీసులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని వారు ఆరోపించారు. ఎస్పీ రావాలంటూ పోలింగ్ బూత్ దగ్గర పోలీస్ వాహనాల ఎదుట టిడిపి కార్యకర్తలు బైఠాయించారు. కాగా ఇద్దరు అభ్యర్థుల మధ్య అధికారులు రాజీ ప్రయత్నాలు నడిచాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications