గతంలో ఆంక్షలు ఉంటే.. ఈసారి చిరునవ్వులు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు !
విజయవాడ సితార సెంటర్లో డూండీ గణేశ్ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల 'కార్యసిద్ధి మహాశక్తి గణపతి' విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. 72 అడుగుల మట్టి గణపతిని ఇక్కడే నిమజ్జనం చేయటం విశేషమని సీఎం చెప్పారు.
తెలుగు ప్రజల శ్రేయస్సే నా ఆకాంక్ష..
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని గణనాథుడిని మనసారా కోరుకున్నాను అని తెలిపారు. ప్రజల జీవితాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా, అభివృద్ధి నిరంతరంగా సాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. చిన్నతనం నుంచి తానే గణేష్ మహోత్సవాలు నిర్వహించేవాడినని గుర్తుచేసుకున్నారు. "విఘ్నాలను తొలగించే శక్తి వినాయకుడికే ఉంది. అందుకే దేశమంతా గణేష్ చతుర్ధిని భక్తి భవంతో జరుపుకుంటారు" అని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధి, జలవనరుల పరిరక్షణపై దృష్టి..
అలానే రాష్ట్ర ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. బుడమేరు వరదలు మళ్లీ రాకుండా సమగ్ర చర్యలు చేపట్టాం. ఈ ఏడాది గోదావరి నుంచి 1500 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినా, రాష్ట్రంలోని జలాశయాలన్నీ నిండుకుండలా ఉన్నాయన్నారు. కరువు భయం లేకుండా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. గణేశ్ మండపాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా కల్పించామని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు పర్మిషన్ల కోసం ఇబ్బందులు ఎదురయ్యేవని.. ఈసారి మాత్రం ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉచితంగా విద్యుత్ అందిస్తున్నాని స్పష్టం చేశారు. దానికి రూ.30 కోట్లు ఖర్చవుతున్నా, ప్రజల ఆనందం కోసం వెనుకాడలేదు" అని తెలిపారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడం తమ సంకల్పం అని.. ప్రజల సౌభాగ్యమే పాలన ధ్యేయమని అన్నారు.
గత ప్రభుత్వంపై మండిపడ్డ సీఎం..
ఈ సందర్బంగా చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 2019 నుంచి 2024 వరకు గణేశ్ ఉత్సవాలు సరిగా జరగనివ్వలేదని గుర్తు చేశారు. ప్రజలు ఆనందంగా పండుగ చేసుకోవడానికీ అడ్డంకులు సృష్టించారని.. వినాయకుడు అంటే తమాషా కాదని.. భక్తిని అపహాస్యం చేస్తే వడ్డీతో సహా వసూలు చేస్తాడని హెచ్చరించారు.
విజయవాడ సితార సెంటర్లో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణనాథునికి పూజలు చేశారు.#vinayakachavithi #ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/lVF8MjpfBj
— Telugu Desam Party (@JaiTDP) August 27, 2025
తమ ప్రభుత్వం మాత్రం భక్తి, సంప్రదాయాలకు అండగా నిలుస్తుందని.. అందుకే ఉత్సవాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతున్నాయని సీఎం వివరించారు. ఇది తమ ప్రభుత్వానికి.. గత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం అని చెప్పుకొచ్చారు. గణేశుడికి దొంగ దొంగతనంగా దణ్ణాలు పెడితే మీరు చేసిన పాపాలు మాఫీ కావన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications