నంద్యాల ఉపఎన్నికను రద్దు చేయాలి: ఈసీకి కాంగ్రెస్ వినతి
నంద్యాల ఉపఎన్నికను రద్దుచేయాలని ఈసీకి కాంగ్రెస్ కోరింది.ఈ ఎన్నికల్లో టిడిపి, వైసీపీలు ఓటర్లను ప్రలోభపెడుతున్నాయని కాంగ్రెస్ ఆరోపణ.
నంద్యాల: నంద్యాల ఉపఎన్నికలను రద్దు చేయాలని మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాదు ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు హేమాన్ష్ ను కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం డబ్బు పంపిణీపై ఆయనకు ఫిర్యాదు చేశారు.

టిడిపి, వైసీపీల అభ్యర్థులూ పోటాపోటీగా డబ్బులను పంచుతున్నారని, ఈసీ తరఫున చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నంద్యాల ఉప ఎన్నికను నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తూ, ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. వినతిపత్రాన్ని పై అధికారులకు పంపుతానని ఈ సందర్భంగా హేమాన్ష్ హామీ ఇచ్చారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications