వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబద్దాలతోనే: బాబుపై ఉండవల్లి, హోదా వద్దు.. ప్యాకేజీయే: చింతా సంచలనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్దాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని రాజమండ్రి నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం నాడు ఆరోపించారు.

పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా పైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా నాటకాలు ఆడుతున్నాయని విమర్శలు గుప్పించారు.

Congress leader wants Special Package

గోదావరి పుష్కర ఘాట్ వద్ద జరిగిన ప్రమాదం పైన ఇంత వరకు ఎందుకు విచారణ జరగలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పుష్కర ఘాట్‌లోనే స్నానం చేశారని ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటన పైన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్య

ఏపీకి ప్రత్యేక హోదా వద్దని, ప్యాకేజీ కావాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదాయపన్ను ఎగ్గొట్టేందుకు 200 మంది పారిశ్రామికవేత్తలు ప్రత్యేక హోదా అడుగుతున్నారని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమకు రూ.50వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలని సిఎం చంద్రబాబుకు సూచించారు.

English summary
Congress leader wants Special Package to Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X