'మాకు నాయకులు కావాలి, పవన్ కళ్యాణ్, జగన్లను పిలుస్తాం!'
చిత్తూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, జనసేన పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
ఆయన గురువారం నెల్లూరు జిల్లాలో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి పటిష్ట నాయకత్వం అవసరమని చెప్పారు. అందుకే వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
బిజెపి విష్ణు అసంతృప్తి
అగ్రిగోల్డ్ కేసు దర్యాఫ్తులో సిఐడి విఫలమైందని బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు వేరుగా ఆరోపించారు. ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆస్తులను సీజ్ చేయకపోవడంతో అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో చర్చిద్దామంటే తమకు సమయం ఇవ్వలేదన్నారు. బాధితులకు న్యాయం జరికే వరకు తాము పోరాడుతామని చెప్పారు. అసెంబ్లీ ఎదుట ధర్నాకు కూడా వెనుకాడేది లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలను తక్కువ పెంచారని, ఇంకొంత పెంచాలని మెజార్టీ సభ్యులు కోరుతున్నారన్నారు.