వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అచ్చన్న షాకింగ్: జగన్ డిమాండ్ వెనుక 'వైసిపి, టిఆర్ఎస్ చేరిక' కుట్ర

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం నాడు స్పందించారు. దీని వెనుక కుట్ర ఉందని షాకిచ్చారు.

ఏపీకి కేంద్రం హోదా ఇవ్వకుంటే ఇరువురు టిడిపి కేంద్రమంత్రులచే రాజీనామా చేయించాలని, కేంద్రం నుంచి టిడిపి వైదొలగాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిత్యం డిమాండ్ చేస్తోంది.

దీనిపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వైసిపి అభివృద్ధి నిరోధక పార్టీ అన్నారు. కేంద్రంలో నుంచి తాము బయటకు రావాలన్న డిమాండ్ వెనుక వైసిపి కుట్ర దాగి ఉందన్నారు. మేం బయటకు వస్తే వైసిపి, టిఆర్ఎస్ చేరాలనే ఆశతో ఉన్నాయని చెప్పారు.

 'Conspiracy behind YSR Congress demand'

టీడీపీలోకి ఆమంచి కృష్ణమోహన్

చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీలో చేరనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో సెప్టెంబర్ 2న తాను పార్టీలో చేరుతున్నట్టు ఆమంచి వెల్లడించారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకే ఉందన్నారు. ఆయన చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరుతున్నానన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి కృష్ణమోహన్ గెలుపొందారు. అంతకుముందు ఆయన బీజేపీలో చేరుతున్నారని కూడా వార్తలు వచ్చాయి.

English summary
AP Minister Atchannaidu sees Conspiracy behind YSR Congress demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X