'ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.., ఒక్క సీటు తక్కువైందని అప్పట్లో వాజ్పేయి!'
హైదరాబాద్: కర్ణాటక రాజకీయ పరిణామాలపై సీపీఐ నేత నారాయణ స్పందించారు. బీజేపీ రాజకీయ విలువలకు తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటికి 8మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నా గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కేరళలో కేవలం ఒక్క సీటు తక్కువైందన్న కారణంతో ప్రతిపక్షంలో కూర్చున్న చరిత్ర సీపీఐది అని గుర్తుచేశారు. కర్ణాటకలో గవర్నర్ ను అడ్డుపెట్టుకుని బీజేపీ అన్యాయానికి పాల్పడుతోందని ఇది అత్యంత విచారకరమని అన్నారు. కర్ణాటక ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు.

గతంలో మాజీ ప్రధాని వాజ్పేయి సైతం ఒక్క సీటు తక్కువగా వచ్చినందుకు నైతికతతో వ్యవహరించి ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారని నారాయణ గుర్తుచేశారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఒక అసెంబ్లీ సీటు తక్కువ వస్తే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications