రాజమండ్రిలో కిడ్నీలు పాడై నలుగురు మృతి..నలుగురి పరిస్థితి విషమం.. కల్తీ పాలే కారణమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రులలో చేరిన వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది ఈరోజు తెల్లవారుజామున లాల చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి మృత్యువాత పడ్డారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.
వాంతులు, మూత్ర విసర్జన కాక ఆస్పత్రిలో 14 మంది
రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ఏకకాలంలో కిడ్నీ వ్యాధి బారినపడి ఆసుపత్రులలో చేరిన విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాలా చెరువు సమీపంలోని చౌడీశ్వరి నగర్ ప్రాంతంలో ఈనెల 15వ తేదీ తర్వాత నుంచి వాంతులతో, మూత్ర విసర్జన కాకపోవడంతో, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో దాదాపు 14 మంది ఆసుపత్రులలో చేరారు. ఇది స్థానికంగా తీవ్ర కల్లోలం రేపింది.

అందరికీ పాలు పోసింది ఒకే వ్యక్తి.. పాల కల్తీ కారణమా
ఆస్పత్రి పాలైన ప్రతి ఒక్కరికి ఒకే వ్యక్తి పాలు సరఫరా చేయడం, పాలలో కల్తీ జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కల్తీ పాల కారణంగానే ఈ విధంగా జరిగి ఉండొచ్చని వారు వైద్యాధికారులు, పోలీసులకు బాధితులు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు వెల్లడించారు.
ఇప్పటికి నలుగురు మృతి, నలుగురి స్థితి విషమం
ఇప్పటికే ఈ ఘటనలో 76సంవత్సరాల భాగిశెట్టి కనక రత్నం, 75సంవత్సరాల తాడి కృష్ణవేణి మృతిచెందగా, తాజాగా 72 సంవత్సరాల ఎన్ శేషగిరిరావు 74 ఏళ్ల రాధాకృష్ణమూర్తి మృతి చెందారు. బాధితులలో ఎక్కువమంది 60 సంవత్సరాలకు పైబడిన వారే కాగా, ఒక ఐదు నెలల శిశువు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఒకేసారి అస్వస్థతకు గురికావడంతో ఆదివారం నాడు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది.
పాల వ్యాపారిని విచారిస్తున్న పోలీసులు
కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి వీరికి ఈ పాలను అందిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అతను విక్రయించే పాలను ల్యాబ్ కు పంపించడంతో పాటు బాధితుల రక్త మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షలకు పంపించారు.
కల్తీ పాల వ్యవహారంతో ఆందోళన
ఇంకా ఈ నివేదికలు రావలసి ఉంది. ఏది ఏమైనా ఏపీలోని రాజమహేంద్రవరంలో ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతుంది. ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు అన్నది తెలియాల్సి ఉంది.
-
YS Sharmila: జగన్ పై ముందుచూపు సరే..! చంద్రబాబుపై షర్మిల సెటైర్లు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications