నన్ను కుక్క కరువబోయింది, రక్షించండి: బిజెపి ఎమ్మెల్యే విష్ణు
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు కుక్కలు, పందుల విషయం చర్చకు వచ్చింది. విశాఖలో కుక్కల గురించి బిజెపి శాసన సభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు ప్రస్తావించారు. ఓ సమయంలో నన్ను కూడా కుక్క కరువబోయిందని, కుక్కల బాధ నుంచి రక్షించాలని విష్ణు అన్నారు. కర్నూలులో పందుల బెడదను వైసిపి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రస్తావించారు.
సభ ప్రారంభమైన తర్వాత మారిన నిబంధనల మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విశాఖలో ఏకంగా 1,00,395 కుక్కలు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు చెప్పారు. కుక్కల కారణంగా జనం బెంబేలెత్తుతున్నారన్నారు.
కుక్కల బెడద నుంచి జనాన్ని రక్షించాలని కోరారు. ఓ సందర్భంలో తనను కూడా ఓ కుక్క కరవబోయిందని, తాను ఎలాగోలా తప్పించుకున్నానని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. కుక్కల గోలపై విష్ణు కుమార్ రాజు చేసిన ప్రసంగంతో సభ్యులతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా కడుపుబ్బా నవ్వారు.

కర్నూలు నగరంలో పందుల బెడద తీవ్రంగా ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ముగ్గురు పిల్లలను పందులు కరిచి చంపేశాయన్నారు. అవి కనిపిస్తే కాల్చి చంపేయాలన్న ఉత్తర్వులు ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
పందుల నివారణకు వెంటనే చర్యలు చేపట్టారన్నారు. అయితే, సుప్రీం తీర్పు ప్రకారం కుక్కలను చంపేందుకు వీల్లేదని, అందువల్ల స్టెరిలైజేషన్ ద్వారా కుక్కులను నియంత్రిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు.
-
YS జగన్ ఎమోషనల్: వైసీపీ ఆవిర్భావ వేళ కీలక ప్రకటన -
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది!












Click it and Unblock the Notifications