ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముంపు: ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో తెలియడం లేదన్న తాటి

|
Google Oneindia TeluguNews

 Don't know, which state MLA I: Thati Venkateswarlu
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడంతో అక్కడి ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల్లో కూడా గందరగోళ పరిస్థితి నెలకొంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలోని పలు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలీనం చేయడం వల్ల తాను ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో తెలియడం లేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అన్నారు.

ఈ విషయంపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రాంతమైన తన స్వగ్రామం కన్నాయిగుట్టను ఏపిలో విలీనం చేయడం వల్ల తాను ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో తనకే అంతుపట్టడం లేదని చెప్పారు.

తనకు ఓట్లేసి గెలిపించిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలతోపాటు తననూ ఏపికి చెందిన వ్యక్తి గా ఆర్డినెన్స్ మార్చివేసిందని అన్నారు.

ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తన శాసనసభ నియోజకవర్గ ప్రజలున్నారని.. ప్రస్తుతం తాను ఏ రాష్ట్ర శాసనసభ్యుడిననేది స్పష్టం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తెలిపారు.

English summary
Aswaraopeta MLA Thati Venkateswarlu on Friday said that he don't know, which state MLA he is.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X