ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు..!?
ఏపీలో ఎన్నికల కసరత్తు మొదలైంది. ఇప్పటికే ఓటర్ల జాబితా పైన ఫోకస్ చేసిన ఎన్నికల సంఘం..తాజాగా ఎన్నికల విధుల ఖరారు పైన చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని శాఖల వారీగా ఉద్యోగుల వివరాలు కేటగిరీలవారీగా పంపాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మోడల్ స్కూళ్లలో పనిచేసే ప్రధానోపాధ్యాయులు సహా అందరి వివరాలూ ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఎన్నికల విధులపై:టీచర్లకు బోధన, విద్యా సంబంధిత అంశాలు మినహా ఎలాంటి బోధనేతర పనులు అప్పగించకూడదంటూ గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవేళ ఏవైనా తప్పనిసరి పరిస్థితులు ఏర్పడి అదనపు సిబ్బంది అవసరమైతే... అన్ని శాఖల ఉద్యోగులను వినియోగించిన అనంతరం అవసరమైతే మాత్రమే టీచర్ల సేవలు వాడుకోవాలని స్పష్టంచేసింది. దీంతో, ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించే ప్రయత్నం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ, ఎక్కడా కూడా ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొన కూడదని పేర్కొనలేదు. ఇక, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్ మీనా తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. జిల్లాల్లోని అన్నిశాఖల వివరాలు, కేటగిరీల వారీగా పంపాలని కోరినట్లు సమాచారం.

వివరాల సేకరణ:వీటిపైన జిల్లా కలెక్టర్లు ఆయాశాఖల అధికారులను అప్రమత్తం చేశారు. అన్నిశాఖల అధికారులతోపాటు ఎన్నికల సంఘం ఆదేశాలతో విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయుల వివరాలు కేటగిరీలవారీగా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. 2024 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉపాధ్యాయులను పీవోలుగా, ఏపీవోలుగా, ఇతర పోలింగ్ అధికారులుగా విధుల్లోకి తీసుకోవడంపై సంసిద్ధత జాబితాను సిద్ధం చేయాలంటూ ఎంఈవోలను కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు క్యాడర్వైజ్గా డిసెంబరు 25లోపు జిల్లా కలెక్టర్కు(జిల్లా ఎన్నికల అధికారి) పంపాలని జిల్లా ప్రజాపరిషత్, మున్సిపల్, మోడల్ స్కూల్, ఇతర పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది.
ఎన్నికల సంఘం నిర్ణయం:ఎన్నికల విధుల నుంచి ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలంటే ఎన్నికల కమిషనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల నుంచి ఎంత మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్నారు....ఎంతమంది ఎన్నికల విధులకు అవసరం అనే అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎవరికైనా మినహాయింపు ఇవ్వాలా వద్దా అనేది ఎన్నికల కమిషన్ నిర్ణయిస్తుంది. అంటే ఎన్నికల విధుల్లో ఎంత మంది సిబ్బంది అవసరం, ఏఏ క్యాడర్ ఉద్యోగులు అవసరం, ఏఏ క్యాడర్ ఉద్యోగులకు ఏఏ విధులు కేటాయించాలి వంటి అంశాల్లో కేంద్ర ఎన్నికల సంఘమే తుది నిర్ణయం. దీంతో, ఇప్పుడు ఎన్నికల్లో విధుల పైన ఉపాధ్యాయుల సంసిద్దత తీసుకోవాలని మెమోలో సూచించటంతో విధుల కేటాయింపుపైన చర్చ మొదలైంది.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications