లా పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ గుంటూరు మాజీ ఎమ్మెల్యే
గుంటూరు: మార్చి నెల వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి మొదలవుతుంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో పలువురు విద్యార్ధులు కాపీ కొడుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే అడ్డదార్లు తొక్కి అడ్డంగా దొరికిపోయిన ఘటనలు గతంలో చాలానే చూశాం.
తాజాగా ఓ ఓ ఎమ్మెల్యేగా సేవలందించిన వ్యక్తి, న్యాయ పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ గురువారం లా మొదటి సంవత్సరం పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు.

గుంటూరు పట్టణంలోని ఏసీ కాలేజీలో లా మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు పరీక్షలకు హాజరైన ఆయన, పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్క్వాడ్ బృందానికి అడ్డంగా దొరికిపోయారు. కాపీ కొడుతున్న వారిలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో పాటు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జిలానీ, బీజేపీ నేత భాస్కరరావు ఉన్నారు.
ఈయనతో పాటు కాపీ కొడుతున్న వారి జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications