కెఈXకోట్ల వర్గాలు, కర్నూల్లో భగ్గుమన్న ఫ్యాక్షన్ రాజకీయాలు: టిడిపి నేత మృతి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాగుర్ భాషా అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఫ్యాక్షన్ అగ్గి రాజుకుంది. కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.

పాతకక్షల కారణంగానే గొడవలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. టిడిపికి చెందిన భాషా చనిపోగా, ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషంగా ఉన్న వారిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇరువర్గాలు కర్రలు, రాళ్లు, కత్తులు చేతబట్టిన ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. అనంతరం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లపై మరో వర్గం రాళ్ల వర్షం కురిపించింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందడంతో.. వారి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications