కెఈXకోట్ల వర్గాలు, కర్నూల్లో భగ్గుమన్న ఫ్యాక్షన్ రాజకీయాలు: టిడిపి నేత మృతి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాగుర్ భాషా అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఫ్యాక్షన్ అగ్గి రాజుకుంది. కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.

పాతకక్షల కారణంగానే గొడవలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. టిడిపికి చెందిన భాషా చనిపోగా, ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషంగా ఉన్న వారిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇరువర్గాలు కర్రలు, రాళ్లు, కత్తులు చేతబట్టిన ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. అనంతరం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లపై మరో వర్గం రాళ్ల వర్షం కురిపించింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందడంతో.. వారి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications