మైత్రివనం సవేరా హోటల్లో అగ్నిప్రమాదం.. పింఛను రాలేదని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో ఉన్న మైత్రీవనం వద్ద సవేరా హోటల్లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదపు వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీ సీఎం సహాయనిధికి విజయ బ్యాంకు విరాళం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విజయ బ్యాంక్ రూ. 50 లక్షల విరాళం అందజేసింది. విజయా బ్యాంక్ సీఎండీ కన్నన్, బీఎస్ రామారావులు మంగళవారం రూ. 50 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.

పింఛను రాలేదని యువకుడి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి అనుబంధ గ్రామమైన నారాయణరావుపల్లెలో పింఛన్ రాలేదని మనస్తాపంతో చిగురు సంజీవ్ (22) అనే వికలాంగుడు అత్మహత్యకు చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సంజీవ్కు గత ఎనిమిది సంవత్సరాలుగా వికలాంగుల పింఛన్ వస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం కొత్త జాబితాలో తన పేరు లేకపోవడంతో సంజీవ్ మనస్తాపానికి గురై ఉరి వేసుకున్నాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. దీంతో కోపద్రిక్తులైన గ్రామస్ధులు దీనికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
ముషీరాబాద్లో సోదాలు
హైదరాబాద్ దక్షిణ మండలం పరిధిలోని ముషీరాబాద్లో మంగళవారం సాయంత్రం పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలకు గాను పోలీసులు ఆరు బృందాలుగా ఏర్పడి విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఘర్షణలో వ్యక్తి మృతి
కడపజిల్లా మైలవరం మండలం జి.ఉప్పలపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో చింతకాయల శ్రీనివాస్ అనే వ్యక్తిని ప్రత్యర్ధులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ గొడవకు కారణం భూవివాదమేనని తెలిసింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications