కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5గురు విద్యార్థినుల అదృశ్యం: కొడుకును చంపిన తండ్రి

|
Google Oneindia TeluguNews

తూర్పు గోదావరి/కర్నూలు: తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఐదుగురు విద్యార్థినుల అదృశ్యం కలకలం సృష్టించింది. రాజమండ్రిలోని రాజానగరంలోని మూడు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 6, 8 తరగతులకు చెందిన ఐదుగురు విద్యార్థినులు మంగళవారం సాయంత్రం అదృశ్యమయ్యారు.

మంగళవారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజమండ్రిలోని ప్రశాశ్‌నగర్, బొమ్మూరులతోపాటు రాజానగరంలోని పోలీస్‌స్టేషన్‌లలో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయా స్టేషన్ల పోలీసులు తెలిపారు.

Five students missing in Rajahmundry

అయితే విద్యార్థునులు ఒకరికొకరు తెలిసినవారేనని, ఇది కిడ్నాప్ అయివుండదని పోలీసులు పేర్కొంటున్నారు. విశాఖపట్నం, కాకినాడకు ప్రత్యేక విచారణ బృందాలను పంపి గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా అదృశ్యమైన విద్యార్థినిలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారని సమాచారం అందడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

అనుమానంతో కొడుకును చంపిన తండ్రి

కర్నూలు: తనకు పుట్టలేదనే అనుమానంతో ఓ కిరాతక తండ్రి తన కుమారుడ్ని నేలకొసి కొట్టి చంపాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలోని కోడుమూరు మండలం తేలకుర్తిలో జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో.. తనకు పుట్టలేదని ఆగ్రహించిన తండ్రి తన మూడేళ్ల కుమారుడ్ని అతి దారుణంగా చంపేశాడు.

English summary
Five School Students missed in Rajahmundry in East Godavari District on Thursday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X