ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య!: ఏలూరులో పెను విషాదం..
ఏలూరులోని బీడీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకోగా.. మృతులను ఒకే కుటుంబానికి చెందిన పద్మావతి(60), సంతోషి రూప(35), సాయి సిద్దార్థ(9), సాయిరామ్(5)లుగా గుర్తించారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఒక కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గత కొన్నాళ్లుగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఏలూరులోని బీడీ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకోగా.. మృతులను ఒకే కుటుంబానికి చెందిన పద్మావతి(60), సంతోషి రూప(35), సాయి సిద్దార్థ(9), సాయిరామ్(5)లుగా గుర్తించారు. నలుగురూ ఒకే ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఇంట్లో నుంచి దుర్వాసన రావడం మొదలైంది. నాలుగు రోజుల క్రితం వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

విషయం తెలియగానే.. సంఘటనా స్థలానికి చేరుకుని, పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఇటీవలే కుటుంబ సభ్యులను కోల్పోవడంతో వీరంతా తీవ్ర మనస్థాపానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే వీరి మరణం వెనుక అసలు కారణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications