కృష్ణా జిల్లాలో టిడిపికి షాక్: మాకేం తెలియట్లేదని మనస్తాపం, నలుగురు రాజీనామా
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. జిల్లాలోని నూజివీడు మండలానికి చెందిన నలుగురు టిడిపి ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కొంతకాలంగా నియోజకవర్గ ఇంఛార్జి వెంకటేశ్వర రావు, ఎంపీటీసీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
గ్రామాలలో ఏ కార్యక్రమం చేపట్టినా ఎంపీటీసీలకు తెలియకపోవడం, అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గ ఇంచార్జి ఏర్పాటు చేశారని చెప్పడంతో వారు మనస్తాపానికి గురయ్యారు.

దీంతో పల్లలమూడి ఎంపీటీసీ సంధ్యారాణి, ఎంఎన్ పాలెం ఎంపీటీసీ శాంతకుమారి, దిగవల్లి ఎంపీటీసీ నాగేంద్రప్రసాద్, రావిచర్ల ఎంపీటీసీ సాంబశివరావు మంగళవారంనూజివీడు ఎండీవో కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామాలను ఎండీవో రాణికి అందించారు.
అయితే వాటిని ఆమె తిరస్కరించారు. ఇది తన పరిధిలోనిది కాదని జిల్లా పరిషత్ సీఈఓకు రాజీనామాలు ఇవ్వాలని సూచించారు. దీంతో బుధవారం నాడు మచిలీపట్నం వెళ్లి రాజీనామాలు సమర్పించేందుకు వారు సిద్ధమయ్యారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications