అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకున్నా: బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, రేవంత్ రెడ్డి తోపాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుడ్ని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు. ఇరురాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, కరువు పోవాలని వినాయకున్ని కోరుకున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగవద్దని వినాయకుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో శుక్రవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, తెలంగాణ టిడిపి నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ తోపాటు పలువురు నేతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని వినాయకుడ్ని ప్రార్థించినట్లు చంద్రబాబు తెలిపారు.
చంద్రబాబు
ఇరురాష్ర్టాల్లో వర్షాలు సమృద్ధిగా కురవాలి, కరువు పోవాలని వినాయకున్ని కోరుకున్నట్లు చెప్పారు.
చంద్రబాబు
ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
చంద్రబాబు
తెలుగు ప్రజలంతా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు విఘ్నాలు కలుగవద్దని వినాయకుడిని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు.