విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిలిండర్ పేలుడుతో మహిళ మృతి, శబ్ధానికి పసికందు: 20మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

 Gas cylinder blast: Two killed, 20 persons injured
విశాఖపట్నం: ఓ ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ, పసికందు మృతి చెందారు. మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి ఆ ఇల్లు కూలిపోయింది.

విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్ పరిధిలోని రంగ్రీజు వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో గాయపడిన వారిని కెజిహెచ్‌కు తరలించారు. గాయపడిన వారిలో ఓ మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన శిశువు వయసు రెండు నెలలు మాత్రమే. పేలుడు సంభవించిన ఎదురుగా ఉన్న ఇంట్లో ఈ చిన్నారి ఉంది.

పేలుడు ధాటికి వచ్చిన భారీ శబ్ధానికి ఈ చిన్నారి మరణించింది. చిన్నారి, మహిళ మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వారి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి

నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్ మండలం పామనగుండ్ల వద్ద ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి

నల్గొండ జిల్లా భువనగిరిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

English summary
Gas cylinder blasted in Poorna Market area in Visakhapatnam. In this incident two killed, 20 persons injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X