సిలిండర్ పేలుడుతో మహిళ మృతి, శబ్ధానికి పసికందు: 20మందికి గాయాలు
విశాఖపట్నంలోని పూర్ణామార్కెట్ పరిధిలోని రంగ్రీజు వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో గాయపడిన వారిని కెజిహెచ్కు తరలించారు. గాయపడిన వారిలో ఓ మాజీ కార్పొరేటర్ కూడా ఉన్నారు. ప్రమాదంలో మృతి చెందిన శిశువు వయసు రెండు నెలలు మాత్రమే. పేలుడు సంభవించిన ఎదురుగా ఉన్న ఇంట్లో ఈ చిన్నారి ఉంది.
పేలుడు ధాటికి వచ్చిన భారీ శబ్ధానికి ఈ చిన్నారి మరణించింది. చిన్నారి, మహిళ మృతితో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. వారి కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. పేలుడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగివున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
నల్గొండ: జిల్లాలోని కట్టంగూర్ మండలం పామనగుండ్ల వద్ద ఆగివున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను నార్కట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
రెండు బైక్లు ఢీ: ఒకరు మృతి
నల్గొండ జిల్లా భువనగిరిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.