భారీగా పెరిగిన టీటీడీ జీయంగార్ల వేతనాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే జీయ్యంగార్ల వేతనాన్ని పెంచుతూ టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద జీయంగార్ల వార్షిక వేతనం ప్రస్తుతం రూ.1.15 కోట్లు ఉండగా దాన్ని రూ.1.50 కోట్లకు పెంచింది.
మరోవైపు చిన్న జీయంగార్ల వేతనాన్ని రూ. 79 లక్షల నుంచి రూ.1.09 కోట్లకు పెంచుతున్న్లు టీటీడీ తెలిపింది. టీటీడీ ఛైర్మెన్ పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి బోర్డు, సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. టీటీడీ తీసుకున్న నిర్ణయంపూ జీయంగార్లు హర్షం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే జీయ్యంగార్లకు జీతభత్యాల పెంచారనే వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో నెటిజెన్లు విమర్శిస్తున్నారు. టీటీడీలో పనిచేసే పేద బ్రాహ్మణులకు కూడా జీతాలు పెంచాలని... ఇప్పటికే జీయంగార్లకు అంత స్థాయిలో జీతాలుండగా మళ్లీ పెంచడం దేనికని నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.