ఉత్తరాంధ్రలో భారీ స్కాం, విదేశాలకు రూ.1,365 కోట్లు తరలింపు, పోలీసుల అదుపులో కీలక నిందితుడు
ఉత్తరాంధ్రలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీల పేరుతో సింగపూర్, హాంకాంగ్, చైనాకు రూ.1,369 కోట్లు తరలించినట్టు గుర్తించారు. కీలక నిందితుడు వడ్డి మహేశ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విశాఖ: ఉత్తరాంధ్రలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. కంపెనీల పేరుతో విదేశాలకు పెద్ద మొత్తంలో నగదు తరలించారు. రూ.1,369 కోట్లు సింగపూర్, హాంకాంగ్, చైనాకు తరలించినట్టు గుర్తించారు.
ఐటీ అధికారులు ఎంవీపీ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు 120బి, 420, 465, 468, 471 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కీలక నిందితుడు వడ్డి మహేశ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ స్కాం వెనుక బడా నేతల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇటీవల విశాఖ, కోల్కతాలో సోదాలు నిర్వహించిన ఐటీశాఖ 12 డొల్ల కంపెనీలను గుర్తించింది. ఓ కుటుంబం భారీగా మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. 12 డొల్ల కంపెనీల్లో 10 కోల్కతాలోనే ఉన్నట్లు ఆధారాలు లభించాయి.












Click it and Unblock the Notifications