ముంబైలో హైద్రాబాద్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

హైదరాబాదు అడిక్మెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్, రుక్మిణిల కూతురు దివ్య. రాష్ట్రంలో ఎంబిబిఎస్ చేశారు. తర్వాత అనస్తీషియా విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు మూడు నెలల క్రితం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరారు. హాస్టల్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం హాస్టలు గదిలో దివ్యను కలుసుకునేందుకు ఆమె స్నేహితురాలు వచ్చారు.
పడుకునే ఉన్న దివ్య స్పందించక పోవడంతో విద్యార్థులు ఆమెను వెంటనే జస్లోక్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే దివ్య మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనస్తీషియా మందును మితిమీరిన మోతాదులో తీసుకోవడం వల్లే దివ్య మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.
ఆత్మహత్య అని చెప్పేందుకు ఆమె గదిలో ఎలాంటి సూసైడ్ లేఖ కనిపించలేదని పోలీసులు తెలిపారు. అయితే దివ్య మృతి హత్యగా తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications