అమరావతిని అక్కడా వదలని జగన్-స్కూల్ బుక్స్ లో పాఠం కూడా ఎత్తేసిన వైనం
ఏపీ ప్రస్తుత రాజధాని అమరావతి ముద్రను చెరిపేసేందుకు ఏ చిన్న అవకాశాన్నీ జగన్ సర్కార్ వదలడం లేదు. ఇప్పటికే రాజధానిగా అమరావతి పేరును తొలగించి మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్.. ఇప్పుుడ మిగిలిన విషయాల్లోనూ అమరావతి ముద్ర కనిపించకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి చరిత్ర ఇక చరిత్రలోనే కనిపించబోతోంది.
అమరావతి పేరు కనిపించకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా ఇప్పటికే అక్కడ ప్రతిపాదిత అంబేద్కర్ స్మృతివనం తొలగించి విజయవాడకు ఈ ప్రాజెక్టను తరలించిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో సైతం అమరావతి చరిత్ర కనిపించరాదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ విద్యాశాఖ అధికారులు అమరావతి చరిత్రను పదో తరగతి పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తూ తాజాగా పుస్తకాలు ముద్రించారు. ఈ బుక్స్ నే విద్యార్ధులకు ఇవ్వాలని వారికి ఆదేశాలు వెళ్లాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు భాష పుస్తకంలో సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద అమరావతి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చారు. పలు ఉద్యోగ పరీక్షల్లో సైతం అమరావతిపై ప్రశ్నలు కూడా అడిగేవారు. కానీ టీడీపీ సర్కార్ అధికారం కోల్పోయాక అమరావతికి కష్టాలు మొదలయ్యాయి.

ఇప్పటికే అమరావతిలో చేపట్టిన పలు ప్రాజెక్టుల్ని అర్ధాంతరంగా నిలిపేయడమే కాకుండా కొత్త ప్రాజెక్టులకు సైతం అనుమతివ్వని జగన్ సర్కార్ ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లోనూ అమరావతి పేరు కనిపించకూడదు, వినిపించకూడదన్న ధోరణిలో ముందుకెళుతోంది. అందుకే తాజాగా ముద్రించిన పాఠ్య పుస్తకాల్లో అమరావతి పాఠం తొలగించడమే కాకుండా.. కొత్త పాఠ్యపుస్తకాలే ఇవ్వాలని కోరారు. అయితే విచిత్రంగా ఈ విద్యాసంవత్సరానికి విద్యార్ధులకు ఇప్పటికే పాత పాఠ్య పుస్తకాలు ఇవ్వడం, అందులో ఉన్న అమరావతి చరిత్రను ఈ ఏడాది విద్యార్ధులకు టీచర్లు బోధించడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అమరావతి చరిత్రలేని పుస్తకాలను విద్యార్ధులకు ఇచ్చి పాత పుస్తకాలు తీసేసుకోవాలని స్కూళ్లకు ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం అమరావతి చరిత్ర కోసమే పాఠ్యపుస్తకాలను తిరిగి ముద్రించినట్లు తెలుస్తోంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications