పనిచేయకుండా గడ్డి పీకుతున్నారా?: కాంట్రాక్టర్లకు దేవినేని 'క్లాస్'
పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ కాంట్రాక్టర్లను మందలించారు.
విజయవాడ: ప్రభుత్వ ప్రాజెక్టుల పట్ల అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేస్తున్నారు ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పనుల్లో జాప్యాన్ని ఎండగడుతూ కాంట్రాక్టర్లకు దేవినేని 'క్లాస్' ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో పెట్టేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి దేవినేని కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ కాంట్రాక్టర్లను మందలించారు. ఒక పని చేస్తున్నామంటే.. దానిపై శ్రద్ద, పట్టుదల, పౌరుషం ఉండాలన్నారు.

ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయాలన్న కసితో పనిచేయాలని కాంట్రాక్టర్లకు హితవు పలికారు. మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు దేవినేని. పనితీరు మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడం ఖాయమని చెప్పారు.
పనులు త్వరగా పూర్తి చేయాలని.. అలా అని నాణ్యతను గాలికొదిలేస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను దేవినేని హెచ్చరించారు. ఎక్కడా నాణ్యతా లోపాలనేవి లేకుండా.. పూర్తి క్వాలిటీతో ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications