Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కే ట్యాక్స్ ఎఫెక్ట్: నరసరావుపేట కోర్టుకు కోడెల కూతురు, వసూళ్ల కేసులో లొంగిపోయిన విజయలక్ష్మీ

కే ట్యాక్స్ పేరుతో బెదిరించి, వసూళ్లకు పాల్పడిన మాజీ స్పీకర్, దివంగత కోడెల శివప్రసాద్ కూతురు విజయలక్ష్మీ నరసారావుపేట కోర్టులో లొంగిపోయారు. బెదిరింపులు, అక్రమ వసూళ్ల కేసుకు సంబంధించి విజయలక్ష్మీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెదిరింపులకు సంబంధించి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదవడంతో.. విజయలక్ష్మీ కోర్టులో లొంగిపోయారు.

శృతిమించిన ఆగడాలు

శృతిమించిన ఆగడాలు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ విజయం సాధించారు. స్పీకర్ పదవీ చేపట్టాక.. అతని కుమారుడు శివరామకృష్ణ, కూతురు విజయలక్ష్మీ రెచ్చిపోయారు. ఎవరినీ వదలకుండా అందినకాడికి దోచుకున్నారు. స్పీకర్ కుమారుడు, కూతురు కదా అని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడ్డారు. కానీ సాధారణ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఒక్కొక్కరు బయటకొచ్చారు. కే ట్యాక్స్ పేరుతో సాగించిన అరాచకాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఒక్కొక్కరు వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకుంది.

ఇలా వెలుగులోకి..

ఇలా వెలుగులోకి..

కోడెల కూతురు విజయలక్ష్మీ మోసం చేసిందని బాధితురాలు పద్మావతి పోలీసులను ఆశ్రయించారు. గుంటూరులో ఎకరం భూమి తనకు ఉందని ఆమె తెలిపారు. ఆ భూమిపై కన్నుపడ్డ విజయలక్ష్మీ నకిలీ రికార్డులతో బెదిరింపులకు దిగిందని వాపోయారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో .. రూ.15 లక్షలు ఇవ్వాలని కోరితే భయపడి ఇచ్చామని తెలిపారు. కానీ తర్వాత మరో .5 లక్షలు ఇవ్వాలని వేధింపులకు దిగుతుందని నిట్టూర్చారు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పిన వినకుండా .. బెదిరిస్తున్నారని ఆరోపించారు. వేధింపులు తాళలేక పోలీసులను పద్మావతి ఆశ్రయించడంతో కోడెల కూతురు అవినీతి పుట్ట కదిలింది. తర్వాత ఒక్కొక్కరు ఫిర్యాదు చేశారు.

 అడ్డు అదుపు లేదు..

అడ్డు అదుపు లేదు..

సత్తెనపల్లి రాజధాని సమీప ప్రాంతం కావడంతో .. కోడెల కూతురు, కుమారుడి ఆగడాలు మితిమీరిపోయాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని, కాంట్రాక్టు పనులు అప్పజెప్పుతామని, అంతేందుకు కేబుల్ వ్యవహారాల్లో కూడా దూరి అందినకాడికి దోచుకున్నారు. వరి పంట కోత తర్వాత గడ్డి స్కాం చేసి కోడెలకు మచ్చ తీసుకొచ్చారు. తన కూతురు, కుమారుడు ఇన్ని చేస్తున్నా మిన్నకుండిపోవడమే కోడెల చేసిన తప్పిదమైపోయింది. అదే అతని పేరు మసకబారిపోయేట్టు చేసింది.

కేసులు, కోర్టులతో ఉక్కిరి బిక్కిరి

కేసులు, కోర్టులతో ఉక్కిరి బిక్కిరి

టీడీపీ హయాంలో చేసిన అవినీతి పుట్ట ఒక్కొక్కటి కదులుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. రేపో, మాపో అరెస్టవడం కంటే కోర్టులో లొంగిపోవడమే మిన్న అనుకొని గురువారం విజయలక్ష్మీ నరసారావుపేట కోర్టులో లొంగిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+