ప్రమాద స్థలమని బోటు సిబ్బంది ముందే చెప్పారు.. అయినా భయపడాల్సిన అవసరం లేదన్నారు..!
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు సమీపంలో జరిగిన బోటు ప్రమాదానికి గురైన వారు ఎక్కువగా వరంగల్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఉన్నారు.ప్రమాదం నుండి బయటపడ్డవారి వివరాల ప్రకారం బోటు ప్రమాదం జరిగే ముందే కచులూరు ప్రాంతం ప్రమాదకరమైన చోటని,అయినా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదని బోటు సిబ్బంది చెప్పినట్టు తెలిపారు.
కాగా ఆయన సంఘటనకు సంబంధించి వివరాలు తెలిపారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో మరికాసేపట్లో పాకికొండలు వస్తాయని బోటు సిబ్బంది చెప్పారని అయితే ఇంతలోనే ప్రమాదం జరిగిన చోటు గురించి ముందే వివరించారని చెప్పారు.కుచులురు ప్రాంతం ప్రమాదకరమైన ప్రాంతమని,బొటు ఆటు ఇటు ఊగుతుందని , అయితే ఎలాంటీ భయం అవసరం లేదని చెప్పారని తెలిపారు. దీంతో వారు చెబుతున్న సమయంలో బోటు ఒక్కసారిగా ఊగిందని వివరించారు.

ఈ సమయంలోనే బోటు వన్సైడ్ ఒరిగిందని ,దీంతో కూర్చున్నవారంతా ఒకపక్కకు వచ్చారని చెప్పారు.అయితే బరువు ఎక్కువ కావడంతో బోటు యాథాస్థానంలోకి రాలేక పోయిందని అన్నారు.దే సమయంలో మొదటి అంతస్తులో ఉన్నవారంతా ఒక్కసారిగా రెండో అంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అది డ్రైవర్ తప్పిదమా లేకుంటే బోటు ఒరిగిపోవడమా అనేది స్పష్టంగా తెలియదు. ప్రమాదం జరిగిన వెంటనే నేను శవాసనం వేసి ప్రాణాలతో బయటపడ్డాను.
అని జనకీ రామరావు వివరించారు. ఈనేపథ్యంలోనే జానకి రామారావు బయట పడగా ఆయన భార్యతోపాటు బావమరిది,ఆయన భార్య పిల్లల ఆచూకి లభించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications